8 నవం, 2015

ప్రేమంటే-(5వ భాగం)




ప్రేమంటే-(5వ భాగం)

ఒకరోజు రంగారావు గారు సురేంద్ర ని పిలిపించారు."ఏమిటి మావయ్యా పిలిచారట."అంటూ వచ్చాడు సురేంద్ర.
అవును బాబూ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందుకే పిలిచాను. రా కూర్చో!"అన్నారు.పక్కనే అపర్ణ,భానుమతిగారు కూడ ఉన్నారు.
కాఫీ తాగుతావా?టీ తాగుతావా ?అని భానుమతి గారు అంటే ,మంచి టీ పెట్టు అత్తా,నీ చేత్తో టీ తాగి చాల రోజులయ్యింది అన్నాడు సురేంద్ర."నువ్వు కూర్చో అమ్మా నేను పెడతానులే,ఏం నా చేత్తో పెడితే బాగోదా బావా! అంది అపర్ణ .అలాగనేం కాదు గాని అత్త ఇంకా బాగా పెడుతుంది.సరే నువ్వే పెట్టు,తర్వాత నీతో గొడవ ఎవడు పడతాడు."నవ్వుతూ అన్నాడు సురేంద్ర.నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అపర్ణ
సరే చెప్పండి మామయ్యా ఏదో మాట్లాడాలన్నారు.?అడిగాడు సురేంద్ర
ఏమిలేదు బాబూ! అపర్ణ పెళ్లి విషయం మాట్లాడదామని.నీకు అపర్ణ మీద ఎలాంటి అభిప్రాయం వుందో తెలుసుకుందామని,మీ అత్తయ్య కూడా ఒక సారి అడగ మంది అందుకనే!

మామయ్యా మీకు తెలుసు కదా!మేమిద్దరం చిన్నప్పటినుండి ఎలా పెరిగామో మీకు తెలియందికాదు. నాకైతే తన మీద అభిమానం తప్ప ఇంకే అభిప్రాయం లేదు.తనని కూడా అడగండి.నాకు తెలిసి తను కూడా ఇదే అభిప్రాయం చెపుతుంది.తనకి ఎవరైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యండి."అన్నాడు సురేంద్ర
"అది సరే మరి నీ సంగతేమిటి? "అడిగారు రంగారావు గారు
"ముందు అపర్ణ పెళ్లి చెయ్యండి మామయ్యా ! తర్వాత ఎవరినైనా చూసి చేసుకుంటాను.అయినా నా పెళ్ళికి ఇప్పుడేమంత తొందరా !" అన్నాడు సురేంద్ర

"అది కాదు బాబూ నువ్వు వొంటరిగా ఉంటున్నావు.ఎంత చెప్పినా ఇక్కడికి వచ్చి వుండవు.నీకు ఒక తోడు ఉంటే బాగుంటుంది.ఎప్పటికైనా చేసుకో వలసిందే కదా "అంది భానుమతి.
"ఔను సురేంద్రా ! ఇంతకీ నిన్ను పిలిపించిన ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే మొన్న వచ్చిన పిల్లల్లో ఒక అమ్మాయి నువ్వంటే చాలా ఇష్ట పడుతోంది.బహుశా నీకు తెలుసనుకుంటా! ఆవిషయం ఆ అమ్మాయి మన అపర్ణతో చెప్పింది.అపర్ణ నాతో చెప్పింది.నేను కూడా ఆ అమ్మాయి తో మాట్లాడాను ....రంగారావు గారు అంటూ ఉండగానే
బావా నీకు తెలియదా ఆ అమ్మాయి ? నా వైపు చూసి చెప్పు అంటూ టీ కప్పులతో వచ్చింది అపర్ణ
"ఏయ్ వెటకారమా! నేనేమైనా చెప్పానా నీతో ! అన్నాడు సురేంద్ర
"నిజం చెప్పు ఆ వచ్చిన అమ్మాయిలలో నీకు బాగా నచ్చిన అమ్మాయి లేదా ! పాపం నీకు వొంట్లో బాగోలేదని నిన్ను చూడ్డానికి కూడా వచ్చింది."అంది అపర్ణ
ఆ అమ్మాయా ! నీల హంస అనుకుంటా! అన్నాడు సురేంద్ర
'చూసావా బావా పేరుకూడా గుర్తుంది.ఇప్పుడు చెప్పు ఆ అమ్మాయంటే నీకు ఇష్టమేగా !అంది
అమ్మాయి బాగానే ఉంది కానీ నాకంటూ ప్రత్యేకమైన అభిప్రాయం ఏమిలేదు.సరే మామయ్యా మీ రేమంటారో చెప్పండి."అన్నాడు సురేంద్ర
"ఆరోజు ఆ అమ్మాయిని కూర్చో బెట్టి మాట్లాడాను.వాళ్ళది చాలా సంప్రదాయ కుటుంబం .తండ్రి మంచి వ్యాపారవేత్త.ఇద్దరు అమ్మాయిలు.పెద్దమ్మాయికి గత ఏడాదే పెళ్ళయ్యింది.నువ్వు ఇష్ట పడితే పెళ్లి గురించి వాళ్ళ వాళ్ళతో మాట్లాడుతాను " అన్నారు రంగారావు గారు
సరే మామయ్యా మరి ఆ అమ్మాయి మన పల్లెటూరికి వచ్చి ఉంటుందా ?
"ముందు ఆ అమ్మాయికి ఈ పల్లె మీద ప్రేమ ఏర్పడింది.తర్వాత నీ మీద ప్రేమ ఏర్పడింది.
నిజంగా ఆ అమ్మాయి ఉత్తమురాలు.అందరు ఆడపిల్లలలా ప్రేమ దోమ అంటూ వెమ్పర్లాడకుండా నా తోనే చెప్పింది.మరి నువ్వు ఊ అంటే వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతాను"అన్నారు రంగారావుగారు
ఇంతలో ఇంటి ముందు కారొకటి వచ్చి ఆగింది.ఎవరా అని చూసారు రంగా రావు గారు.
కారులోంచి హుందాగా ఉన్న ఒక వ్యక్తీ ఆయన వెనకాల ఆయన భార్య అనుకుంటా దిగారు.వెనకాలే నీల హంస కూడా దిగింది.అప్పుడు అర్ధమయ్యిందిరంగారావు గారికివచ్చింది ఎవరో! గబగబా పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళింది అపర్ణ.
దొంగ ! ఉండలేకపోయావా! అమ్మని నాన్నని వెంట పెట్టుకు వచ్చావు? అంది అపర్ణ
సిగ్గు పడిపోయింది. "అదేమీ కాదు నాన్న కి రంగారావు అంకుల్ తెలుసుట.అందుకే ఈ రోజు ఆదివారం కదా అని ఇలా వచ్చాము."అంది నీల హంస
అయితే అమ్మకి నాన్నకి చెప్పేసావా?
లేదే ! అంకుల్ కి చెప్పాను కదా ఆయనే కదుపుతారులే! అని నవ్వుతూ అనేసింది.
ఒరేయ్ శ్రీధర్ నువ్వేమిటిరా ఇక్కడ ?అంటూ ఆశ్చర్యపోయారు రంగారావు గారు
"ఇదిగో నా కూతురు పుణ్యమా అని నిన్ను కలిసే అదృష్టం కలిగింది.మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిన సంగతి చెపితే గానీ వాళ్ళు ఈ వూరు వస్తున్నారని తెలియలేదు.బాగున్నావా చెల్లెమ్మా? "అంటూ పలకరించారు శ్రీధర్.
ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించు కుంటూ ఆనంద పడిపోయారు. అప్పుడు పరిచయం చేసారు సురేంద్ర ని ఇతను మా మేనల్లుడు అని రంగారావుగారు.(సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి