14 సెప్టెం, 2013

శీర్షిక మీదే

శీర్షిక మీదే

దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి . మన దేశ ప్రధాని రాజధాని విశాఖపట్నంలో డాల్ఫిన్స్ హిల్స్ పై ఎప్పటిలాగే సప్తవర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతినుద్దేసించి ప్రసంగించ నున్నారు. ప్రతివారు తమతమ అండర్ గ్రౌండ్ డెన్ ల నుండి ఈ కార్యక్రమాన్ని మైక్రో టాప్ లలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు అని శాటిలైట్ న్యూస్ ఇప్పుడే వెలువడింది . ప్రజలు ఈ కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించడానికి ఆటో సోలార్ ప్రొటెక్టెడ్ కాప్సుల్స్ ద్వారా తెల్లవారుఝామున 5గంటలనుండి 6 గంటలవరకు ఆకాశం లో వుండి  వీక్షించవచ్చని, ప్రధాని హయ్ ప్రొటెక్టెడ్ మోనో కాప్సుల్  లో వచ్చి పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగం చేస్తారు . కోస్తా దేశ  పౌరులందరూ కార్యక్రమానికి రావాలనుకుంటే తమతమ రక్షణ తో తామే రావాలని తప్పనిసరిగా సరిపడా ఆక్సిజన్ కూడా తెచ్చుకోవాలని రద్దీ కారణం గా  స్కై ఆక్సి టెర్మినల్స్ వద్ద సరిపడా ఇంధనం ఉండక పోవచ్చునని ,అత్యవసర సేవల కోసం 801 బజర్ సర్వీసెస్ కి బజార్ పంపవలసిందని తెలియ చేయడమైనది . దీనితో పాటు కాకినాడ రాజమండ్రి శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి ,తుని పెద్దాపురం మొదలైన రాష్ట్రాలలో కూడా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జెండా ఎగురవేస్తారని తగిన ఏర్పాట్ల పర్యవేక్షణ ,ఆయా రాష్ట్రాలే చూసుకుంటాయని ప్రధాని తెలియ జేశారు . కోస్తా దేశం ఈ సందర్భంగా కాకినాడ నుండి కొన్నిప్రాంతలను వేరుచేస్తూ సముద్రగర్భ అనే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆల్ మంగళం పార్టీ అధ్యక్షురాలు రోబో చండీ గారు ప్రకటించారు . సముద్రగర్భ రాష్ట్రానికి కాకినాడ కేంద్రం గా ఉంటుందని సముద్రం మీద జీవించే వాళ్ళ పెట్టుబడితోనే కాకినాడ అభివృద్ధి చెందిందని కాబట్టి కాకినాడ లో కాకినాడ ప్రజలెవరికి హక్కులు లేవని కావాలంటే హొప్ ఐలాండ్ లో ఏ ప్రాంతన్ననియా కాకినాడకి రాజధానిగా చేసుకోవచ్చని దీనిపై ఎవరు ఏ అభ్యంతరాలు చెప్పరాదని ప్రకటించడమైనది . కాకినాడ రాష్ట్ర ప్రజలు ఆందోళన బాట పట్టనున్నారు . (కోస్తా దేశం 2037 డిసెంబర్ 31 న ఏర్పడింది ,కోస్తా దేశం రాజధానిగా విశాఖపట్నం ,మిగిలిన ప్రముఖ నగరాలన్నీ రాష్ట్రాలుగా 2038 జనవరి 1 న ఏర్పడ్డాయి . సముద్రగర్భ రాష్ట ఏర్పాటు నిర్ణయాన్ని 2047 డిసెంబరు 30 న వెలువడింది .) మన కోస్తా దేశానికి పొరుగున వున్న ఒరిస్సా దేశం కృష్ణ గుంటూరు దేశం తో రక్షణ సంబంధాలను మెరుగు పరిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు . తెలంగాణా దేశాన్ని పాలకులు ముక్కలు ముక్కలుగా చేసి  పోరుగుదేసాలకు అమ్మేసుకుని పోరుగుదేసాలలో కర్రీ పాయింట్లు,టిఫిన్ సెంటర్ లు పెట్టుకుని బతుకుతున్న్నారు  . ప్రజలు మాత్రం రాయలసీమ కోస్తా దేశాలలోని తమ పూర్వీకులతో కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నారు  ఈ రెండు దేశాలలో ప్రజలు సముద్ర గర్భ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం పై తమ పూర్వ అనుభవాన్ని  గుర్తుచేసుకుని విడిపోతే జరిగే నష్టాల గురించి వివరించారు . 
(నోట్ : ఇది కేవలం రాష్ట్ర విభజన పై ఆవేదనే కాని ఎవరిని కించ పరచాలని కాదు )   

1 కామెంట్‌:

  1. Dear Viewers,
    Every couple vaallaki iddaru pillalu undaali ani enduku anukuntaaru? oka child(male/female) puttina taruvaatha inko child ni Orphanage nundi adopt chesukunte entha baaguntundhi... Inko baby ni kani..penche capacity unnapudu aa chance oka orphan child ki iste entha baaguntundhi... Nijam ga samaajam baagu paduthundhi... Okkasaari aalochinchandi...

    రిప్లయితొలగించండి