29 ఆగ, 2013

ఏమి జరుగుతోంది

ఏమి జరుగుతోంది 

త్యాగధనుల కలల రూపమా 
చారిత్రక కళల అపురూపమా 
సంస్కృతీ సాహిత్య ప్రాభవమా 
సమతా మమతల మాతృమూర్తి 
భాషా ప్రయుక్త రాష్ట్రానివిగా 
తొలితాంబూలం అందుకున్నదానివి 
 ఆంధ్రమాతగా ,తెలుగు తల్లిగా 
అ గ్ర తాంబూలం అందుకున్నదానివి 

ఇన్నేళ్ళలో ఏ సామాన్యుడు 
నేను తెలంగాణా వాడినని,
నేను  రాయల సీమ వాడినని
కోస్తా వాడినని ఎప్పుడూ అనుకోలేదు
విడిపోవడమంటే మనసులు
ముక్కలు చేసుకోవడమేనని
కుక్కలు చింపిన విస్తరి చేసుకోవడమేనని
అనాదిగా మానవుడు నమ్ముతూ వచ్చిన సిద్ధాంతం

కానీ ఇప్పుడేమిటి తల్లీ నీ కళ్ళముందే
కాపురాలు కుల్చాలనే కుళ్ళు ఆలోచనలు
కడుపుకింత తినడానికి తిండి దొరకాలన్నా
తాగడానికి గుక్కెడు నీళ్ళు దొరకాలన్నా
కలిసుంటేనే కలలు సాకారమని
రాబోయే తరాలతలరాతలు మార్చాలనుకునే
ఈ కుళ్ళు రాజకీయ నాయకులకు తెలియదా
నేటి బిడ్డల నోళ్ళలో రేపు మన్ను పడుతుందని

తలుచుకుంటే మాకే గుండె తరుక్కుపోతోంది
కన్నపేగును రెండుగా చీల్చుతుంటే
ఒకకంటిలో అల్లం మరోకంటిలో బెల్లం పెడుతుంటే
ఏమిచేయాలో పాలుపోని నిర్వేదంలో ఓ తెలుగుతల్లీ
కన్నీరు కార్చకు , దానినికుడా రాజకీయం చేస్తారు
ఓట్లుగా మలచుకొంటారు మన రాజకీయ కీచకులు
సామాన్యుడు నిస్సహాయుడుగా నిలబడే లోకంలో
అమాత్యుల పైసాచికత్వానికి బలైపోతున్న తెలుగుతల్లీ

నీకోసం రెండు కన్నీటి చుక్కలు కార్చడంతప్ప

ఏమీ చేయలేని అసహాయుడు ... ......... ఆంధ్రుడు    

  
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి