ఉదయం 4. 35 ,కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో ఎనౌన్స్ మెంట్ . కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్ళే పాసింజరు మరికొద్ది సేపట్లో ప్లాట్ఫారం పైకి రాబోవుచున్నది . 4. 38 ట్రెయిన్ ప్లాట్ ఫారం మీదకి వచ్చేసింది . కొంతమంది ఆఖరి బోగీలు ఖాళీగా వుంటాయని , కొంతమంది ముందు బోగీలు ఖాళీగా ఉంటాయని, మరికొంతమంది నిలబడినచోటే ఎక్కొచ్చని సిద్ధంగావున్నారు . బండి ఆగుతుండగానే గబగాబగా సీటు కోసం ఎగబడుతున్నారు . నెమ్మదిగా ట్రైను బయలుదేరింది ,వేగం పుంజుకుంది . హమ్మయ్య ఎలాగోలా ఎక్కేసాం , భగవంతుడి దయవల్ల సీటు దొరికింది అని కొంతమంది , బాబు కొంచెం జరగండి వైజాగ్ దాకా వెళ్ళాలి అని బతిమాలి సీటు అడిగి కొంతమంది ఉపిరి పీల్చుకుంటున్నారు . ఇంతలో ట్రైన్ సామర్లకోట వచ్చేసింది . ఇంజను మారాలి , ఒక పది నిముషాలు అనుకున్న జనాలకి సరిగ్గా గంట తర్వాత బయలుదేరిన ట్రైన్ ని తిట్టుకోక తప్పలేదు . ప్రతి స్టేషన్ లో ఎక్కేవాళ్ళు బతిమాలుకొనో జబర్దాస్తిగానో ఉన్నంతలో సీటు సంపాదించుకుంటున్నారు . అదే ఇంకొకరికి సీటు ఇవ్వవలసి వచ్చేసరికి లేదండి ఖాళీ లేదు అని చెపుతున్నారు. నోరున్నవాడిదే రాజ్యం . నెమ్మదిగా ఒక్కొక్క స్టేషన్ దాటుకుంటూ వెళ్తోంది ట్రైన్ . కాఫే,టీ ,తినుబండారాలు అమ్మేవాళ్ళు కూడా ప్రయాణికులతో పోటీపడుతూ ఎక్కుతున్నారు ,జనాలని తొక్కు కుంటూ అమ్ముకుంటున్నారు . బిచ్చగాళ్ళ సంగతి సరేసరి ,ఇలా రణగొణధ్వనులతో ప్రయాణం సాగిపోతోంది . నెమ్మదిగా రైలు అనకాపల్లి చేరింది . అప్పటిదాకా వుండే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది . తట్టలు బుట్టలు పట్టుకొని కొంతమంది లంచ్ బాగ్లు పట్టుకొని ఉద్యోగస్తులు కాలేజీ పిల్లలు ఇంకా వ్యాపారస్తులు బిలబిల లాడుతూ ఎవ్వరిని పట్టించుకోకుండా తోసుకుంటూ ఎక్కేస్తున్నారు . అడ్డంగావచ్చిన వాళ్ళని నోటితో అదిలిస్తూ బెదిరిస్తూ చోటు సంపాదించుకుంటున్నారు . కాలేజేపిల్లలు చాటింగులు చేజింగులు , ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు ,బాసులగురించి ఇలా ఎవరికితోచింది వాళ్ళు మాట్లాడే సుకుంటున్నారు . కొంతమంది మాటలు మొదట దేవుళ్ళ గురించి అక్కడినుండి మతం గురించి , కులాల గురించి రాజకీయంగురించి ఇలా ఒక్కొక్క విషయంగురించి చర్చించుకుంటూ తిట్టుకుంటూ తమ చర్చలు అందరు వింటున్నారో లేదో చూస్తూ ,ఎవడిమతిక్కివాడు తను వాదించే విషయంలో తానె పెద్ద మేధావినన్నట్లు ఫీలైపోతూ సపోర్ట్ కోసం పక్కవాళ్ళని అడుగుతూ దీనివల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్తాయనేది కూడా పట్టించుకోకుండా ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్నారనే ధ్యాస కూడా లేకుండా అసభ్య పదజాలాన్ని వాడుతూ ఆ ప్రతిభకి కూడా పొంగిపోతు వాదించు కుంటున్నారు . ఇది ఒకరోజు జరిగే ప్రక్రియ కాదు . రోజు జరిగేదే , సభ్యసమాజంలో ఎలాప్రవర్తించాలొ తెలియని ఆ చదువుకున్న పశువులకి జ్ఞానోదయం ఎప్పుడవుతుందో !ఏది ఎలా ఉన్నా రైలు మాత్రం తనగమ్యాన్ని చేరుకుంది
I TOO HAD THIS KIND OF EXPERIENCE SO MANY TIMES. I TOO FELT BAD. MOST OF THOSE PEOPLE BEHAVE LIKE LITERATE ANIMALS.
రిప్లయితొలగించండిnitya prayanam lo jarigevi chala bagundi
రిప్లయితొలగించండి