13 మార్చి, 2013

గిరిజన ప్రాంతం


తూర్పుగోదావరి జిల్లాలో 7మండలాలు గిరిజన ప్రాంతంగా గుర్తించ బడ్డాయి . అడ్డతీగల,రంపచోడవరం,రాజవొమ్మంగి,మారేడుమిల్లి ,దేవీపట్నం,గంగవరం,వై రామవరమ్. ఈ ప్రాంతమంతా కల్మష రహితమైన ప్రకృతికి,మనసులకు నిలయమ్. ఇక్కడ చూడదగిన ప్రదేశాలలో అడ్డ తీగలకు దగ్గర లో 4కి. మి. దూరంలో పింజరి కొండ జలపాతం ఒకటి . ఇక్కడ n.t.r. పాదుకా పట్టాభిషేకం అనే సినిమా తీసారు,ఇంకా చిరంజీవిశోభన్ బాబు సినిమాలుకూడా ఈ ప్రాంత అందాలను తెరకెక్కించారు. ఇంక రంపచోడవరం దగ్గరలో రంప అనెఅ ఊరు వుంది,ఇక్కడ కొండపైశివరాత్రికి గొప్ప ఉత్సవం జరుగుతున్ది. ఇక్కడకూడా జలజల జారే జలపాతాలు కోకల్లలు . ఇంక మారేడు మిల్లి గురించి వర్మగారు పోస్ట్లో చూసాం . వనసంపద కి గని ఈ ప్రాంతం . శివరాత్రికి గిరిజనప్రాంతం లో చాలా చోట్ల ఘనంగా ఉత్సవాలు చేస్తారు . నీను పుట్టిన వూరు దుప్పులపాలెం . నాన్నగారి ఉద్యోగ రీత్యా 1963 నుండి ఇక్కడ ఉన్నారు. ఆ రోజుల్లో గిరిజనులకి చాలామందికి ఏది ఎలా తినాలో తెలియదు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మేమే.పనసకాయని పచ్చి గా వుండగానే కోసి తొనలు తీసి ఒక కుండలో వేసి ఉప్పు కారం వేసి ఉడికించేవారు. ఉడికాక తినెవారు. సీతాఫలం ఐతే పరువుకి వచ్చిన కాయలు ఆకులలో చుట్టి మంటలో వేసి కాల్చెవారు. ఇలా వారి ఆహారపు అలవాట్లు వుండేవి . చేపలని పట్టుకొని నిప్పులో కాల్చుకొని తినేవారు నెమ్మదిగా వారు నాగరికత వైపు అడుగులు వేస్తున్నారు . ఆ పచ్చని అడవులలో హాయిగా ఆనందం గా గడిపే వాళ్ళం . ఇలా ఎంత రాసినా నేను పుట్టిపెరిగిన ప్రాంతం గురించి తరగదు, తనివి తీరదు ... మీ అందరి ప్రోత్సాహం తో వ్రాయడానికి సాహసించాను . తప్పులుంటే సరిదిద్ది నన్ను ముందుకి నడిపిస్తారని ఆశిస్తూ   


2 కామెంట్‌లు:

  1. మీ టపా బాగుంది. బ్లాగింగ్ కొనసాగించండి. ఆల్ ద వెరీ బెస్ట్!

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదములు. తప్పనిసరిగా నా ప్రయత్నం కొనసాగిస్తాను.మీప్రోత్సాహం ఎల్లప్పుడు ఆశిస్తూ...మానస వీణ

    రిప్లయితొలగించండి