12 మే, 2015

రా (చ )జధాని



రా (చ )జధాని (కవితల సుమహారం-29 )

వస్తున్నాయ్ వస్తున్నాయ్
రాజధాని రధా చక్రాల్ వస్తున్నాయ్
ఊరవతల వేలల్లో ఎకరాలకుఎకరాలు
సర్కారీ భూములెన్నో పడివుంటే
కోట్లల్లో కూడెట్టే భూముల్ని కొల్లగొట్టే
పధకాలను రచించి పందేరం సిద్ద్డం చేసి
రైతన్నను సుఖాలలో ముంచి తేలుస్తారట
చెమటోడ్చి భరతావనికి అన్నంపెట్టే రైతన్న
సమశీతోష్ణ భవనాలలో సేదతీరుతాడా?
వారి సుఖం మాట అటుంచితే
మరి మనకూడు సంగతేమిటి ?
ఆంధ్ర ప్రదేశ్ ను సింగ"పూరు"గా మారుస్తామంటే
అర్ధం వ్యవసాయానికి పాడి కడతామనా
అవునులే ఒకప్పుడు వ్యవసాయందండగన్న ఏలిక
ఒకప్పుడు రాజులలోసమన్వయం లేక ఆంగ్ల ఏలికలొస్తే
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని చిల్లరగా విదేశాలకు అమ్మేసి
మళ్ళా మరో నాల్గు శతాబ్ధాలకు బానిసలనిచేసే పధకాలు
ఓట్లేసే దాకా ఓటు మల్లయ్య ,ఓటేసాక వోటిమల్లయ్య
రాచరికపు సౌకర్యాలలో ప్రభువులు మునిగితేలుతారట
ప్రభువులకి సామంతులకి మంత్రులకి
ప్రజాధనం దిగమింగడం తప్ప ప్రజలగోడు పట్టేనా
చెట్టుకిందైనా కూర్చుని పరిపాలిస్తానన్న అన్న
అన్నన్నా! ప్రస్తుతానికి ఉమ్మడి రాజదానిలో
ఏలినవారి పరిపాలనాభవనాలకి కొంగొత్త సొబగులు
మననేతలకు కరెంటు,రెంటు,రైలుచార్జీలు బస్సుయాతనాలు
గాస్ కష్టాలు ఉండనే వుండవు ,ఎందుకంటే
వారు అసామాన్యులు అమాత్యులు,మనం సామాన్యులం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి