14 మే, 2015

****మహాత్ముడు ****



(కవితల సుమహారం -46 )మన తెలుగు మన సంస్కృతి- చి త్ర క వి త – 73


భారతీయుల హక్కు మహాత్ముడు
సామాన్యుడుగా పుట్టిన మోహన్ దాస్
బిడియస్తుడైన ఒకయువకుడు
దక్షిణాఫ్రికా లో నల్లజాతి వారిబాధలుచూసి
భారతావనిలో తెల్లజాతి పీడనపై
సత్యాగ్రహ బ్రహ్మాస్త్రమెక్కుపెట్టి
కొల్లయిగట్టి శాంతీ అహింసల మంత్రంతో
జాతి జాగృతంచేసి ,పరపీడన పిశాచాన్ని
పారద్రోలేందుకు దండి వైపుగా అడుగువేసి
సహాయనిరాకరణ తో సాగిపోతూ
క్విట్ ఇండియా నినాదంతో జాతిని ఉర్రూతలూగించి
స్వాతంత్ర మహాపలాన్ని భారతమాతకు నివేదించి
కులమతవర్గ విభేదాలను రూపుమాపే దిశగా
జాతిసమైక్యతకు జీవంపోసిన జాతిపిత
నాథూరం తూటాలకు బలి అయ్యి
ధ్రువతారగా అందనితీరాలకు చేరిన "మహాత్ముడు"
నేడు మాత్రం వీధి వీధిన విగ్రహంగా
కుళ్ళు రాజకీయ నాయకుల నెత్తిన టోపీ గా మారి
నిరాదరణకి గురవుతుంటే ,అశ్రు నివాళి తప్ప
జయంతి వర్ధంతులకు మనమేమివ్వగలం మహాత్మునికి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి