14 మే, 2015

* ప్రకృతి -మనం*



(కవితల సుమహారం-38 )
'సాహితీ సేవ ' చిత్ర కవితల పోటీ - 10
* ప్రకృతి -మనం* " తృతీయ ఉత్తమ కవిత


ఉత్తరాన హిమవత్పర్వతాల ధవళవర్ణ శోభితం
తూర్పు పడమటి కనుమల పచ్చదనం
దక్షిణాన కన్యాకుమారీ ప్రపుల్లితం
ఎటుచూచినా అలరారు ప్రకృతి సోయగం
భువిపై స్వర్గమే ననుగన్న నాభారతం
వివిధ ఫలభార శాఖా శిఖా తరువరాలతో
సురభిళ పుష్ప సౌరభాలతో శోభాయమానం
నానావిధ పక్షులకూజితాలతో పరవశం
పవిత్రనదీనదాల నాదాలతో శ్రవణ్మధురం
చతుర్వేద పారంగతమైన కోనసీమ అందం
కోమలి చిరునవ్వులాంటి సుప్రభాత సమీరం
కవ్వింతల పులకింతలతో సాగరసంగమం
ఎలమావి చిగురుమెసవిన కోకిలల గానం
ఎద లోతుల్లో విభవించు భావతరంగం
కలబోసి ఇలలోన వెలయించు స్వచ్చ భావనం
ఏ జన్మ పుణ్యమో ఈభువిపైన జననం
కానీ కాలుష్యపు విషసర్పం కాటుతో
కానున్నది ఈ భూతల స్వర్గం సర్వం భస్మం
మానవాళి మనుగడకే ఇది మహాశాపం
మానవుడే తనకుతానుచేసుకున్న పాపం
కృత్రిమ సుఖసౌఖ్యాల మోజులో
ప్రాకృతిక సుమసౌరభాలను కాల రాస్తున్న వైనం
నిదుర మత్తు వదలి మేల్కొనవలసిన కాలం
ఒక్కచిన్నమొక్క నాటినా అది నీవంతు సహకారం
అదే మరోతరానికి నీవుచేసే మహోపకారం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి