కృష్ణా తరంగాలు లో కొత్త ప్రక్రియ రెండవ అక్షరం ఏకాక్షరం గా కవిత
(కవితల సుమహారం-25)
కలంకారీ పనితనముతో
అలంకృతమైనమేలిముసుగుతో
ఫలంబుల పళ్ళెరము చేబూని
శైలంబుల కావల దేవళములో పవిత్ర
జలంబులతో అభిషేకింప వెడలితి ,ప్రభుని
ఆలంబనమునకు ఆర్తితోడ ,మరి
విలంబముచేయక తోడు కూడి
సాలంకృతముగ రావదే ధీర !నీ
బలంబున భయమెరుగక దర్సనంబుచేయ
గలందాన సతతము నిను మదిన్
తలంతు నే మనోహర మందారా
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి